
ఎస్.రాయవరం :- వేసవికాలం ఆదివారం కావటంతో మండలంలోని రేవుపోలవరం సముద్రతీరం పర్యాటకులు సందండితో హోరెత్తింది.భగభగమండుతున్న ఎండతీవ్రత తోస్వేద తీరేందుకువివిధ ప్రాంతాలునుండి సముద్రతీరానికి వేలాదిమంది పర్యాటకులు తరలివచ్చారు. తీరంలో ప్రకృతి అందాలను ఆశ్వాదిస్తూ సముద్రతీరంలో జలాకాలాడుతూ సరదాగా గడపటంతో పాటు వేసవితాపంనుండి ర్యాటకులు స్వేద తీరారు.తీరంలో పెంటకోట మెరైన్ పోలీసుల గస్తీ నిర్వహించారు.

