
యలమంచిలి టౌన్ :- అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, యలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావులు మర్యాదపూర్వకంగా కలిసి అచ్చుతాపురం మండలం దుప్పుతురు గ్రామ తరలింపు విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై చంద్రబాబునాయుడు స్పందిస్తూ నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూస్తామని, దుప్పితూరు గ్రామ అభివృద్ధిలో ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని,త్వరలోనే గ్రామంలో అన్ని సమస్యలకు పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తెలిపారు.మీరు ఇరువురు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు అభినందనలు తెలియజేశారు…



