
విజయనగరం జిల్లా:- రాజాం మండలం గెడ్డవలసలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపడి ముగ్గురు మహిళలు మృతి చెందారు.పొలంలో దొండకాయలు ఏరుతుండగా గాలులతో కూడిన వాన కురవగా..అకస్మాత్తుగా పిడుగు పడి పైల రాము,మజ్జి అప్పల నరసమ్మ,మజ్జి సత్తమ్మ మృతి చెందారు.ఒకే ఇంట్లో తోడి కోడల్లు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.వారి కుటుంబీకులు,బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.



