
ఈఏడాది జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీల్యాండ్లోని నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు.సోమవారం సెక్రటేరియట్ లో సీఎంను కలిసిన వారిలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా,నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల,కాన్ఫరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి,ఈశ్వర్ బండా,ప్రవీణ్ పాల్ రెడ్డి ఉన్నారు…


